Wednesday, April 24, 2024

ప్రాణం తీసిన కరోనా భయం….

- Advertisement -
- Advertisement -

Women dead with corona fear in Bhadradri

భద్రాద్రి: కరోనా సోకిందన్న భయంతోనే ఓ మహిళ ప్రాణాలు విడిచిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వినాయకపురం కాలనీకి చెందిన నారం శ్రీదేవి(35) ఐదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోంది. వైద్య పరీక్షల నిమిత్తం ప్రాథమిక వైద్యశాలక వెళ్లినప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది ఆమెకు కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. ఆమె కరోనా పాజిటివ్ రావడంతో ఇంటికి వచ్చిన భావోద్వేగానికి లోనయ్యారు. బిగ్గరగా ఏడ్వడంతో శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఎదురైంది. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోనికి వెళ్లింది. ఆమె భర్త సమాచారం మేరకు 108 సిబ్బంది వచ్చేలోపు ఆమె ప్రాణాలు విడిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News