Saturday, April 20, 2024

ప్రాణం తీసిన స్కార్ఫ్

- Advertisement -
- Advertisement -

Women dead with scarf at Bhadradri Kothagudem

 

భద్రాద్రి కొత్తగూడెం: స్కార్ఫ్ మహిళ ప్రాణాలు తీసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెంలోని తల్లాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎపిలోని కృష్ణా జిల్లా పైడూరుపాడు గ్రామానికి చెందిన షేక్ మాలన్‌బీ భద్రాద్రి కొత్తగూడెంలోని తన అన్నగారింటికి వచ్చింది. లాక్‌డౌన్ విధించడంతో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎపికి రాకపోకలు నిలిచిపోయాయి. తన అన్నగారింట్లోనే ఉండిపోయింది. లాక్‌డౌన్ సడలించడంతో తన సొంతూరుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఆమె మేనల్లుడు తన బైక్‌పై ఇంటికి తీసుకెళ్తానని చెప్పడంతో ఆమెను బైక్ ఇద్దరు ప్రయాణించారు. కానీ ఆమె ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని ఉండడంతో వెనక చట్రంలో స్కార్ఫ్ చుట్టుకోవడంతో కిందపడిపోయింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె చనిపోయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఎస్‌ఐ తిరుపతి రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతి దేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News