- Advertisement -
మన తెలంగాణ/బిజినేపల్లి: కోడిగుడ్డు గొంతులో ఇరుక్కొని మహిళ మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని శాయిన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… శాయిని పల్లి గ్రామానికి చెందిన కుందేళ్ళ భాగ్యమ్మ (33) శనివారం రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో కోడి గుడ్డు తింటున్న సమయంలో గొంతులో ఇరుక్కొని మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు తెలిపారు.
- Advertisement -