Thursday, April 25, 2024

మహిళ హత్య…. నీటిలో పడేసిన దుండగులు

- Advertisement -
- Advertisement -

గుర్తు తెలియని మహిళలను హత్య చేసి కల్వర్టు వద్ద నీటిలో పడేసిన దుండగులు..

Women murder in Vikarabad

మనతెలంగాణ/పూడూరు: ఓ వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని చిన్న బండతండాలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పూడూరు గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న చిన్న బండతండా, రాకంచర్ల ఇండస్ట్రీయల్ పార్క్ సమీపంలో హైదరాబాద్, బీజాపూర్ జాతీయ రహదారి పక్కన ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి ఆపై హత్య చేసి రోడ్డు పక్కలా ఉన్న కల్వర్టు కింద నీటి గుంటలో కట్టేకు తాడు ప్లాస్టిక్ వైరుతో కట్టేసి పడేశారు. ఈ విషయం తెలుసుకున్న పరిగి సిఐ లక్ష్మీరెడ్డి, చన్‌గోములు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన విషయాన్ని పరిశీలించి మృతురాలిని బయటకి తీసి పోస్టు మార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ మహిళలు ఎవరూ..? ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు.? హత్య చేసిన దుండగులు ఎవరూ ఎందుకు ఇలా జరిగింది అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News