Thursday, April 25, 2024

ఆడపిల్ల పుట్టిందని వేధించి..వేధించి గెంటేశారు

- Advertisement -
- Advertisement -

 

 

ఆడపిల్ల పుట్టిందని వేధించి..వేధించి గెంటేశారు

హైదరాబాద్ ఉప్పల్ సాయినగర్ కాలనీలో అత్తింటి వద్ద ఓ మహిళ పోరాటం

మన తెలంగాణ/ సిటీబ్యూరో: ఆడపిల్ల పుట్టిందని ఇంట్లోకి రానీయకపోవడంతో ఓ వివాహిత భర్త ఇంటి ఎదుట ఆందోళన చేస్తోంది. ఈ సంఘటన ఉప్పల్‌లోని సాయినగర్ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం శ్రీనివా స్ రెడ్డికి రెండేళ్ల క్రితం వివాహం జరిగిం ది. కొద్ది రోజుల పాటు వారి కాపురం స జావుగా సాగింది. వీరికి కూతురు పుట్టిన తర్వాత కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. బాధితురాలిని భర్త శ్రీనివాస్ రెడ్డి, అతడి సోదరుడు, తోటి కోడలు, అత్తామామలు వేధించడం ప్రారంభించారు. వీరి వేధింపులు తట్టుకోలేక బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అత్తింటి వారు బాధితురాలిని, ఆమె కూతురును ఇంట్లో నుంచి గెంటివేశారు. తర్వాత ఇల్లుమార్చి అద్దెకు ఉంటున్నారు. ఇంటి చిరునామా తెలుసుకుని ఇంట్లోకి వెళ్లగా బాధిత మహిళను అక్కడి నుంచి కూడా గెంటివేశారు. తనకు తోడుగా వచ్చిన వారిపై కూడా తన అత్తింటి వారు దాడి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను భర్తతో కాపురం చేయకుండా అడ్డుకుంటున్న అత్తామామ, బావ, తోడి కోడలిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు.

Women protest at front of Husband’s House in Uppal

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News