Friday, April 19, 2024

వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో బోణి కొట్టిన భారత్.. ఆసీస్ పై ఘనవిజయం

- Advertisement -
- Advertisement -

సిడ్నీ:ఐసిసి మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా జరిగిన తొలి టి20 మ్యాచ్ లో భారత్ జట్టు 17 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. భారత స్పిన్నర్ పూనమ్ యాదవ్ అద్భుత బౌలింగ్ తో నాలుగు కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్ వెన్ను విరిచింది. కట్టుదిట్టమైన బంతులతో చెలరేగిన పూనమ్ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించింది. భారత్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 19.5 ఓవర్లలో 115 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ ఉమెన్స్ లో ఓపెనర్ అలాసా హీలి(51) అర్థ సెంచరీతో చెలరేగగా.. ఆష్లీ గార్డనర్(34) రాణించింది. అయితే మిగతా బ్యాట్స్ ఉమెన్స్ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయకుండా ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 4 వికెట్లు, శిఖా పాండే 3 వికెట్లు పడగొట్టగా.. రాజేశ్వరి గైక్వాడ్ ఒక వికెట్ తీసింది.ఇక, మ్యాన్ ఆఫ్ ది ఉమెన్ అవార్డు పూనమ్ యాదవ్ కు దక్కింది.

Women’s T20 World Cup: India beat Australia by 17 runs 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News