- Advertisement -
హైదరాబాద్: ఆన్లైన కొనుగోళ్ల కోసం ఈ గోల్కొండ ప్లాట్ ఫామ్ను చేనేత, జౌళి శాఖ రూపొందించిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ గోల్కొండ ద్వారా కళాకృతులు, చేతి బొమ్మలు కొనుగోలు చేస్తామన్నారు. ఈ గోల్కొండ ప్లాట్ ఫామ్ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ను బలోపేతం చేస్తున్నామని, హస్తకళల ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రైవేటు ఈ కామర్స్ వెబ్సైట్ల కంటే ఈ గోల్కొండ పోర్టల్ ద్వారా దేశంలోని ఏ ప్రాంతానికైనా కళాకృతులు సరఫరా చేయవచ్చన్నారు. golkondashop.telangana.gov.inలో కళాకృతులను ఆన్ లైన్ బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎంఎల్సి వివేకానంద, ఎంఎల్సి శంభీపూర్ రాజు తెలిపారు.
- Advertisement -