Friday, April 19, 2024

సిరిసిల్లలో రెజ్లింగ్ క్రీడాకారుడు ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

Wrestling Player suicide with poison in Rajanna Sircilla

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌ గ్రామంలో జాతీయ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొప్పాపూర్‌ గ్రామానికి చెందిన రెజ్లింగ్ క్రీడాకారుడు భుజంకార్ శ్రీనివాస్(24) ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్రీనివాస్ మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Wrestling Player suicide with poison in Rajanna Sircilla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News