Friday, April 19, 2024

హైదరాబాద్ ఆటగాడికి కరోనా….

- Advertisement -
- Advertisement -

Wriddhiman saha corona positive

ముంబయి: ఐపిఎల్‌లో ఆటగాళ్లకు కరోనా సోకుతుండడంతో మ్యాచ్‌లు వాయిదాపడుతున్నాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు వృద్ధిమాన్ సాహాకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఇవాళ జరగాల్సిన హైదరాబాద్-ముంబయి జట్ల మధ్య మ్యాచ్ వాయిదా పడనుంది. ఆటగాళ్లు, కోచ్, గ్రౌండ్ సిబ్బంది కరోనా బారిన పడుతుండడంతో లీగ్ కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐపిఎల్ మ్యాచ్‌లపై బిసిసిఐ ఇవాళ సమావేశం కానుంది. ఐపిఎల్ లీగ్‌ను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News