Friday, March 29, 2024

జీ20 సదస్సులో కెనడా ప్రధానిపై జిన్‌పింగ్ అసహనం !

- Advertisement -
- Advertisement -

 

బాలి : ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే చైనా, జీ 20 వేదికగా జరిపిన చర్చల వివరాలు బహిర్గతం కావడంపై కెనడాపై అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే… చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో జీ 20 సదస్సులో భాగంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

అనంతరం ఈ భేటీ వివరాలు మీడియాలో రావడంపై ట్రూడో తీరుపట్ల జిన్‌పింగ్ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ కెనడా జర్నలిస్టు రికార్డు చేశారు. “ మనం చర్చించిన విషయాలు మీడియాలో వచ్చాయి. ఇది సరైన పద్ధతి కాదు. చర్చలు జరిపై విధానం ఇది కాదు” అని జిన్‌పింగ్ అసహనం వ్యక్త చేశారు. దీనిపై ట్రూడో మాట్లాడుతూ “ కెనడాలో ప్రతీదీ పారదర్శకంగా నిజాయితీగా ఉండాలని మేం భావిస్తాం . దాన్నే మేం కొనసాగిస్తాం. కలిసి పనిచేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధం . కానీ కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం సాధ్యం కాదు ” అని జిన్‌పింగ్‌కు బదులిచ్చినట్టుగా ఆ వీడియోలో రికార్డయింది.

అనంతరం ఇరువురు నేతలు పరస్పరం కరచాలనం చేసుకుని ఎవరి దారిలో వారు వెళ్లి పోవడం ఈ వీడియోలో చూడొచ్చు. మూడేళ్ల తరువాత చైనా అధ్యక్షుడు, కెనడా ప్రధాని మధ్య జీ 20 సదస్సు వేదికగా చర్చలు జరిగాయి. ఈ భేటీలో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News