- Advertisement -
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్, స్మార్ట్ టీవీ బ్రాండ్ షావోమీ తన ప్రీమియం శ్రేణి ఉత్పత్తులకు కొత్త గుర్తును ప్రకటించింది. తన ప్రీమియం ‘ఎంఐ’ సిరీస్ ఉత్పత్తులను ఇప్పుడు ‘షవోమీ’ పేరుతో మార్పు చేసింది. సంస్థ తన కొత్త బ్రాండ్ గుర్తును పరిచయం చేయడంతో పాటు తన బేసిక్ కార్పొరేట్ బ్రాండ్లో భాగంగా రెండు ప్రత్యేక ఉత్పత్తి శ్రేణిని కలిగి ఉంటుంది. కార్పొరేట్ బ్రాండ్ ‘ఎంఐ’తో సమర్పించడాన్ని కొనసాగిస్తున్నట్టు షావోమీ ఇండియా మార్కెటింగ్ విభాగాధిపతి జస్కరణ్ సింగ్ కహాని తెలిపారు. ఈ పండుగ సీజన్కు ప్రీమియం ఉత్పత్తుల శ్రేణి ‘ఎంఐ’ను ‘షావోమి’గా వ్యవహరించనున్నామని అన్నారు.
- Advertisement -