Friday, March 29, 2024

పోస్ట్ కోవిడ్ అభ్యాస సంక్షోభాన్ని అధిగమించిన ఎక్సీడ్ విద్యార్థులు..

- Advertisement -
- Advertisement -

పాఠశాలకు వెళ్లే పిల్లలు ఇప్పటికీ మహమ్మారి ప్రేరేపిత విద్యా సంబంధిత అగాధంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో, XSEED అనే, సింగపూర్ ఆధారిత, నిరూపితమైన బోధనా పద్ధతిగా ఉండడంతో పాటు CBSE, ICSE, రాష్ట్ర బోర్డ్‌లు మరియు అంతర్జాతీయ సిలబస్‌లతో సహా అన్ని బోర్డులకు వర్తింపజేయబడి, విద్యార్థులు ఈ భారీ అభ్యాస సంక్షోభం నుండి మరింత సమాచార సహితంగా, విశ్వాసంతో మరియు పూర్తి-సామర్థ్యం కలిగిన వారుగా బయటపడేందుకు సహాయపడింది. భారతదేశంలోని 20 రాష్ట్రాల్లో నర్సరీ నుండి గ్రేడ్ 8 వరకు ఉన్న 2 మిలియన్ల మంది విద్యార్థులకు XSEED సేవలందించింది.

XSEED లెర్నోమీటర్ స్కిల్స్ టెస్ట్ 2022కి సంబంధించిన ఇటీవలి అంశాలు — భారతదేశంలోని పాఠశాల పిల్లలు ఎదుర్కొన్న అతిపెద్ద, అత్యంత సమగ్రమైన నైపుణ్యాల ఆధారిత పరీక్ష XSEED ప్రోగ్రామ్‌ను నేర్చుకునే విద్యార్థులు వారి గత సంవత్సరపు ఓవరాల్ స్కోర్లతో పోలిస్తే, కోవిడ్ అనంతర అభ్యాసంలో 31% మెరుగుదల ప్రదర్శించినట్లుగా గుర్తించారు. అంతేకాకుండా, XSEEDలో నేర్చుకున్న పిల్లలు గత సంవత్సరంతో పోలిస్తే ఇంగ్లీషులో 30%, గణితంలో 26%, సైన్స్‌లో 39% కంటే ఎక్కువ అభివృద్ధి ప్రదర్శించారు.

XSEED లెర్నోమీటర్ పరీక్ష అనేది 90-నిమిషాలు (1-3 గ్రేడ్‌ల కోసం) నుండి 120 నిమిషాలు (4-8 గ్రేడ్‌లు కోసం) జరిగే ఒక కంప్యూటర్ ఆధారిత వార్షిక పరీక్ష. సాధారణంగా ఇది సంప్రదాయ పరీక్షల కంటే చాలా కష్టతరమైన పరీక్షగా పరిగణించబడుతుంది. ఎందుకంటే, ఈ పరీక్షల్లో విద్యార్థులు కేవలం చదివిన విషయాలు, సూత్రాలను గుర్తు చేసుకోవడానికి బదులుగా వారి జ్ఞానాన్ని వర్తింపజేయాల్సి ఉంటుంది.

ఈ పరీక్షలో మూడు ప్రధాన సబ్జెక్టులతో పాటు, విద్యార్థుల్లోని మూడు ప్రధాన ఆలోచనా నైపుణ్యాలను — కాన్సెప్ట్ ఆధారిత అవగాహన, సమస్య-పరిష్కారం, కమ్యూనికేషన్ — కూడా అంచనా వేయడం జరుగుతుంది. ఈ పిల్లల కమ్యూనికేషన్ నైపుణ్యాల్లో మెరుగుదల అత్యధికంగా 47% ఉన్నట్లు గుర్తించారు.

అంతేకాకుండా, డిమాండ్ కలిగిన మిడిల్-స్కూల్ సంవత్సరాలకు (6,7,8 తరగతులు) సంబంధించి, నాన్-XSEED విద్యార్థులతో పోలిస్తే XSEED విద్యార్థులు 21% మెరుగైన ప్రదర్శన కనబరిచారు. తోటి వారితో పోలిస్తే, ఇంగ్లీషు కమ్యూనికేషన్ నైపుణ్యాల్లో (+22%) మెరుగైన నైపుణ్యం, మెరుగైన కాన్సెప్ట్ ఆధారిత అవగాహన (+29%) అనేది ఈ అత్యుత్తమ పనితీరుకి ఆధారంగా నిలిచింది.

“XSEED అనేది ‘Ed’ని Edtechలో ఉంచుతోందని సూచించే ఈ ఫలితాల ప్రోత్సాహకర దిశను చూసి మేము సంతోషిస్తున్నాము. కోవిడ్ కారణంగా, పిల్లలకు ఎదురుకాగల అభ్యసన నష్టం గురించి తల్లిదండ్రులు సరైన దిశలోనే ఆందోళన చెందారు. అయితే, కనీసం XSEED విద్యార్థులు సరైన విధంగానే కోలుకుంటున్నారని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా, ఉన్నత తరగతుల్లోని XSEED విద్యార్థులు 20% అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.

తోటివారితో పోలిస్తే, బోర్డు పరీక్షల కోసం వారి సంసిద్ధతను, పిల్లల విద్యా పునాది కోసం పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే లాభాన్ని ఇది నొక్కి చెబుతోంది. మేము ఈ అధ్యయనాన్ని విస్తరింపజేస్తాము, దానిని మరింత సంవృద్ధంగా, మరింత పటిష్టంగా మారుస్తాము” అని హార్వర్డ్ పూర్వ విద్యార్థి, ప్రపంచ ప్రఖ్యాత విద్యావేత్త డాక్టర్ హోవార్డ్ గార్డనర్ గారి మాజీ విద్యార్థి, XSEED ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు ఆశిష్ రాజ్‌పాల్ అన్నారు.

XSEED అకడమిక్ ప్రోగ్రామ్ అనేది పాఠశాలల్లో అమలు చేయబడిన ఒక పరిశోధనా-ఆధారిత బోధనా పద్దతి. ఇది పిల్లల్లో సంభావిత ఆలోచనను, అవగాహనను మెరుగుపరుస్తుంది. ఆంగ్ల భాషా వ్యక్తీకరణను బలపరుస్తుంది. వారిలో విశ్వాసం పెంచుతుంది. 2014లో అంతర్జాతీయంగా ప్రారంభమైనప్పటి నుండి XSEED భారతదేశం వ్యాప్తంగా ఉన్న 220 జిల్లాలు, 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో 2 మిలియన్ల మంది పిల్లలకు సేవలు అందించింది. భారతదేశం, ఫిలిప్పీన్స్, మధ్యప్రాచ్యంతో సహా ఎనిమిది దేశాల్లో అమలు చేయబడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News