Friday, March 29, 2024

రామారంలో అన్నను చంపిన తమ్ముడు

- Advertisement -
- Advertisement -

గుండాల: యాదాద్రి జిల్లా గుండాల మండలం రామారంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో అన్నను తమ్ముడు రాడ్డుతో కొట్టి చంపాడు. అన్న నర్సయ్య (55)ను సాయికిరణ్ (42) కొట్టి చంపాడు. డయల్ 100కు ఫోన్ చేసి హత్య గురించి నిందితుడు చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News