Wednesday, April 24, 2024

యాద్రాద్రిలో మూడు రోజులు దర్శనాలు నిలిపివేత

- Advertisement -
- Advertisement -

Yadadri darshan stop for three days

 

హైదరాబాద్‌ : యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు  పేర్కొన్నారు. స్వామి వారి నిత్య కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నామని, అలాగే ఆన్‌లైన్‌ సేవలు, దర్శనాలు భక్తులకు అందుబాటులో ఉంటాయని, అలాగే పాతగుట్ట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలోనూ దర్శనాలు బంద్ చేస్తున్నామని ప్రకటించారు. యాదగిరిగుట్టలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంతో పాటు ప్రధానార్చకులతో పాటు మరో ఇద్దరు అర్చకులు, ఉద్యోగికి వైరస్‌ సోకడంతో దర్శనాలు నిలిపివేశారని, ఇప్పటికే పలు పార్టీల నాయకులు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతకు వినతి పత్రాలు అందజేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రజాప్రతినిధులు, స్థానికులు లాక్‌డౌన్‌ విధించాలని కోరారని విప్‌ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News