Thursday, April 18, 2024

మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతామం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిష్ణ జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. తమ జోలికోస్తే ఎగరేసి నరుకుతామంటూ రెడ్డి పాలెం వైసిపి యువతరం పేరిట ఫెక్సీలు వెలిశాయి. వైసిపి నేతలు గుడివాడ నియోజకవర్గ సరిహద్దు గ్రామం రెడ్డిపాలెంలో వైసిపి నేతలు ఫ్లెక్సీలు పెట్టారు. ఇవాళ రెడ్డిపాలెం మీదుగా గుడివాడ నియోజకవర్గంలోకి అమరావతి రైతులు పాదయాత్ర చేయనున్నారు. తాము ఎవరి జోలికీ వెళ్లమని, తమ జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతామంటూ వైసిపి యువదళం ఫెక్సీలు వెలిశాయి. ఉద్రిక్తలు తలెత్తకుండా ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News