Friday, March 29, 2024

వైసిపి అరాచకం.. రక్తం వచ్చేలా కొట్టారు…

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టిడిపి నాయకులపై వైసిపి శ్రేణులు దాడులు చేశాయి. మాచర్లలో పర్యటిస్తున్న టిడిపి నాయకులు బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నపై వైసిపి కార్యకర్తలు కర్రలతో దాడులు చేశారు. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహారించడంతో బుద్ధా వెంకన్న తగలాల్సిన దెబ్బ న్యాయవాది కిశోర్ కు తగిలింది. న్యాయవాది తలపై బలంగా కొట్టడంతో రక్తంతో తడిచిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మాచర్లలో టిడిపి అభ్యర్థి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో న్యాయపరమైన సమస్యను పరిస్కరించడానికి అక్కడికి వెళ్తే తమపై వైసిపి కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడులు చేశారని బుద్ధా వెంకన్న తెలిపారు.  డ్రైవర్ వేగంగా కారు నడపడంతో కొన్ని సెకన్ల వ్యవధిలో దాడి నుంచి తప్పించుకున్నామని వెంకన్న పేర్కొన్నారు. న్యాయవాది తలకు బలమైన గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 

YCP Workers attack on TDP leaders in Macharla
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News