Friday, March 29, 2024

లోక రక్షకుడు ఏసుక్రీస్తు: డాక్టర్ పి.సతీష్‌కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హసన్‌పర్తి: ప్రపంచ మానవాళికి లోక రక్షకుడిగా ఏసుక్రీస్తు అని ప్రపంచ సువార్తికులు డాక్టర్ పి.సతీష్‌కుమార్ అన్నారు. మంగళవారం రాత్రి వరంగల్‌లోని కల్వరి టెంపుల్ ఆలయంలో ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రపంచ సువార్తికులు కల్వరి టెంపుల్ ఫౌండర్ డాక్టర్ పి.సతీష్‌కుమార్ హాజరై క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. ఈసందర్భంగా పాస్టర్లను, విశ్వాసులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఈలోకంలో ఉన్న ప్రతిఒక్కరికి లోకరక్షకుడు ఏసు ప్రభు అని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా ప్రతి ఒక్కరు ఏసుక్రీస్తును అంగీకరించాలని, ఆనందించాలని, ఆరాధించాలని అప్పుడే నీకు నాకు సమాధానం ఉంటుందని తెలిపారు. అంతకుముందు ఏసుక్రీస్తు జన్మదినం గురించి నాటికను ప్రదర్శించారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ఏసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్న పాస్టర్లకు నూతన వస్త్రాలను అందజేశారు. కొవ్వత్తులను వెలిగించి క్రిస్మస్ కేక్ కట్ చేసి వచ్చిన పాస్టర్‌లకు, విశ్వాసులకు పంపిణీ చేశారు. సంగీత సాంస్కృతిక కార్యక్రమాలతో క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాజీపేట, హన్మకొండ, వరంగల్ పట్టణాలకు చెందిన ప్రజలతో పాటు వివిధ గ్రామీణ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News