- Advertisement -
ఢిల్లీ: యోగాతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కరోనా వైరస్ దృష్టా ప్రజలందరూ ఇళ్లల్లో ఉండి యోగా చేయాలని కోరారు. కుటుంబంతో కలిసి యోగా చేయాలని మోడీ సూచించారు. శ్యాస వ్యవస్థపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుందని, ప్రాణాయామంతో అధిగమించవొచ్చని పేర్కొన్నారు. ప్రపంచమే యోగా అవశ్యకత గురించి తెలుసుకుందని కొనియాడారు. యోగాతో ప్రజల మధ్య సౌభ్రాతత్వం, ఐకమత్యము పెరుగుతుందని తెలియజేశారు. రోగాలు దరిచేరకుండా ఉండాలంటే యోగా, ప్రాణాయామంతోనే సాధ్యమవుతుందన్నారు.
- Advertisement -