Friday, April 26, 2024

యుపి మంత్రి వర్గ విస్తరణ : కొత్తగా ఏడుగురికి అవకాశం

- Advertisement -
- Advertisement -

Yogi Adityanath expands UP Cabinet

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సారధ్యం లోని మంత్రివర్గంలో కొత్తగా ఏడుగురికి చోటు కల్పించారు. కాంగ్రెస్ మాజీ నేత జితిన్ ప్రసాద్, మరో ఆరుగురు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్ లోని గాంధీ భవన్‌లో సాయంత్రం 5.30 గంటలకు గవర్నర్ ఆనందిబెన్ మంత్రులచే ప్రమాణసీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో జితిన్ ప్రసాద్‌తోపాటు ఛత్రపాల్ సింగ్, పట్లురామ్, సంగీత బల్వంత్, సంజీవ్‌కుమార్, దినేష్ ఖడిక్, ధర్మవీర్ ప్రజాపతి ఉన్నారు. ఈ కొత్తవారితో మొత్తం మంత్రి వర్గం సంఖ్య 60 కు చేరింది. ఉత్తరప్రదేశ్‌కు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ జరగడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News