Wednesday, April 24, 2024

యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ కు కరోనా

- Advertisement -
- Advertisement -

yogi adityanath tests positive for coronavirus

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆయన ట్వీట్ చేశారు. తన కార్యాలయంలోని కొందరు అధికారులు వైరస్ సోకడంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. తాజాగా యోగి పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తెలిసింది. దీంతో తనను ఇటీవల కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని యుపి సిఎం కోరారు. గత వారం యుపి సర్కార్ ఏప్రిల్ 30 వరకు అన్ని పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. ప్రతిరోజు 100కి పైగా కొత్త కోవిడ్ కేసులు వచ్చే జిల్లాల్లో రాత్రి 9 నుండి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూలు విధించాలని అధికారులను ఆదేశించింది. గత 24 గంటల్లో యుపి‌లో ఒకే రోజు 17,963 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 85 మంది కరోనాతో మరణించారు.

yogi adityanath tests positive for coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News