Friday, April 26, 2024

రోడ్డు ప్రమాదం… చికిత్స పొందుతూ యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

చికిత్స పొందుతూ యువకుడి మృతి

Young dead in road accident in warangal

 

మన తెలంగాణ/సంగెం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన గురువారం వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సంగెం మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన కొంగూరి కిరణ్‌కుమార్(26) ఎంబిఎ చదువుతున్నాడు. ఈనెల 10న నల్లబెల్లి నుంచి ద్విచక్ర వాహనంపై మొండ్రాయికి వెళ్తుండగా అదుపుతప్పి ద్విచక్ర వాహనం నార్లవాయి క్రాస్ రోడ్డులో కల్వర్టు గుంతలో పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం అతడిని ఆసుపత్రి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుని తండ్రి సూరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కానిస్టేబుల్ శ్రీనాథ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News