Thursday, April 25, 2024

విద్యుదాఘతంతో యువ రైతులు మృతి

- Advertisement -
- Advertisement -

Young farmer died of electrocution in Thorrur

 

మహబూబాబాద్: వర్షాలు సమృద్దిగా కురుస్తుండడంతో వానాకాలం సాగుకు రైతులు సన్నద్దమవుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు రైతులు తమ పొలానికి వెల్లి పనిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మరణించారు. ఈ విషాద ఘటన జిల్లాలోని తొర్రూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భోజ్య తండాలో కరెంట్‌ షాక్‌కు గురై ఇద్దరు యువ రైతులు మరణించారు. ఇవాళ ఉదయం తండాకు చెందిన భూక్య సుధాకర్‌, మాలోతు యాకూబ్‌ ఇవాళ ఉదయం తమ పొలం వద్దకు వెళ్లారు. పొలంలోని బోరు స్టార్టర్‌కు ఉన్న ఫీజులు పోవడంతో వాటికి వేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బోరుకు తాకి ఉన్న జే వైరుకు విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో ఇద్దరు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఊహించని ఘటనతో ఇరుకుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News