Saturday, April 20, 2024

వాష్ రూమ్‌కు వెళ్తున్నానని చెప్పి…. యువతి అదృశ్యం…

- Advertisement -
- Advertisement -

Young girl missing in Secunderabad

 

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ యువతి వాష్ రూమ్‌కు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి అదృశ్యమైంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  మినీ ఎంజెల్ (22) యువతి స్టాప్ నర్సుగా హైదరాబాద్‌లో పని చేస్తోంది. తమిళనాడు రాష్ట్రం రాణిపేట్ జిల్లాకు చెందిన బాబు థామస్ కూతురు. హైదరాబాద్ నుంచి శబరి ఎక్‌ప్రెస్‌లో తమిళనాడు వెళ్లేందుకు తండ్రితో కలిసి ఎంజెల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వాష్‌రూమ్‌కు వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వాష్‌రూమ్ నుంచి ఆమె బయటకు రాకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా ఆమె కనపించలేదు. వెంటనే తండ్రి జిఆర్‌పి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News