Thursday, April 25, 2024

యువతి అదృశ్యం… తలలేని ఎముకల గూడుగా మారి…

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: తలలేని ఎముకల గూడు కలిగిన యువతి మృతదేహం బావిలో తేలిన సంఘటన తమిళనాడు రాష్ట్రం సేలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కారిపట్టి ప్రాంతం పిన్నాంపల్లిలో గ్రామంలో కాశీ విశ్వనాథ్‌కు వ్యవసాయ బావి ఉంది. ఆ బావిలో తల లేని ఎముకల గూడు కలిగిన యువతి మృతదేహం కనిపించడంతో విశ్వనాథ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సేలం జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి అదృశ్యమైన యువతి వివరాలను సేకరించారు. ఎంజిఆర్ నగర్‌కు చెందిన కన్మణి కుమార్తె తిత్తిమిలా (19) అక్టోబర్ 6న అదృశ్యమైంది. తల్లిదండ్రులు ఈ మృతదేహంపై దుస్తువుల ఆధారంగా తమ కుమార్తెగా గుర్తించారు. సేలంలోని ప్రభుత్వ ఆర్ట కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. తల కోసం పోలీసులు బావిలో వెతుకుతున్నారు. ఆమెపై అత్యాచారం చేసి చంపేశారా? లేక ప్రేమ పేరుతో నమ్మించి ఎవరైనా హత్యా చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News