Wednesday, April 24, 2024

భార్యను పోషించలేనని…. యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Couple Commits Suicide In Pedana At Krishna In AP

నిజామాబాద్: ఉద్యోగం, ఉపాధి లేకపోవడంతో పెళ్లి చేసుకున్న తరువాత భార్య పోషించడం కష్టంగా మారుతుందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం జీత్యాతండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాందాస్ (24) అనే యువకుడికి నిజాంసాగర్ మండలం గాలిపూర్ గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి పత్రిక తీసుకుని తన అత్తగారింటికి వెళ్లాడు. అనంతరం ఇంటికి వచ్చిన యువకుడు భార్యను పోషించడం కష్టమేనని మదనడుతూ బావి దగ్గరికి వెళ్లాడు. పంట పొలంలోనే ఉరేసుకున్నాడు. ఎస్ఐ శ్వేత ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News