Saturday, April 20, 2024

ఉద్యోగం రావడం లేదని యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Father Murder By Sons In Sangareddy

 

పెద్దపల్లి: ఉద్యోగం రావడంలేదని బిటెక్ చేసిన యువకుడు ఆత్మహత్యచేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా ముతారం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అడవి శ్రీరామ్‌పూర్ గ్రామంలో గట్టు రవి, లక్ష్మిలకు రాజు కుమారుడు ఉన్నాడు. కుమారుడు ఇంజినీరింగ్ చేయడం కోసం ఆ దంపతులు కరీంనగర్‌కు కూలీ పనులకు వెళ్లారు. రాజు జెఎన్‌టియులో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. శ్రీరాంపూర్‌లో తాత కనకయ్య, నానమ్మ శంకరమ్మల వద్దకు రాజు వచ్చి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నాడు. తల్లిదండ్రులు కూలీ పనులకు పోయి వచ్చేసరికి రాజు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజినీరింగ్ చేసి ఉద్యోగం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News