Thursday, April 25, 2024

స్నేహితులతో మద్యం పార్టీ… ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Young man commit suicide in Sangareddy

 

సంగారెడ్డి: స్నేహితులతో విందు జరుగుతుండగా గొడవ జరగడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం దౌల్తాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. దౌల్తాబాద్‌కు చెందిన సాయిచరణ్ అనే యువకుడు (24) తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో స్నేహితులతో మద్యం పార్టీ విందు చేసుకున్నాడు. స్నేహితులతో సాయిచరణ్‌కు గొడవ జరిగింది. స్నేహితులు వెళ్లిపోయిన తరువాత సాయి చరణ్ ఇంట్లో ఉరేసుకున్నాడు. సోమవారం తల్లిదండ్రులు ఇంట్లోకి వచ్చేసరికి ఫ్యాన్‌కు వెలాడుతూ కనిపించాడు. రాత్రి ఇంట్లో గొడవ జరిగిందని పక్కింటి వారు చెప్పడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News