Friday, April 19, 2024

వివాహం కావడం లేదని యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బంట్వారం: వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. ముప్పై ఏళ్లు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలానికి చెందిన వడ్ల పద్మ, వీరాచారి హైదరాబాద్ సనత్ నగర్ పరిధిలోని బబ్బుగూడలో నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కుమారుడు ప్రవీణ్ (30)కి ఎన్ని సంబంధాలు చూసిన పెళ్లి కుదరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్త మార్చురీకి తరలించారు. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News