Saturday, April 20, 2024

ప్రేమించిన యువతి మోసం చేసిందని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Young man committed suicide in Vanasthalipuram

సెల్ఫీ వీడియోలో వివరాలు వెల్లడి
వనస్థలిపురంలో సంఘటన

వనస్థలిపురం: ప్రేమించిన యువతి, స్నేహితులు మోసం చేశారని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని విఎంఆర్ లాడ్జిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. ఎపిలోని ప్రకాశం జిల్లా, పసుపు గల్లుకు చెందిన షేక్ బ్రహ్మం(30) లారీల వ్యాపారంర చేస్తున్నాడు. కాసింబీతో వివాహం జరగగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. పక్కన ఉన్న గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. నెల రోజుల క్రితం ప్రేమించిన యువతిని తీసుకుని వెళ్లాడు. ఈ విషయం తెలిసిన భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. ప్రేమించిన యువతిని ఆమె తల్లిదండ్రులు వచ్చి తీసుకొని వెళ్లారు. గత కొన్ని రోజుల నుంచి మద్యం తాగి తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే షేక్ బ్రహ్మం తన స్నేహితుడు వేణుతో కలిసి నగరానికి వచ్చాడు.

వనస్థలిపురంలోని విఎంఆర్ లాడ్జిలో రూమ్ తీసుకుని ఉన్నారు. సాయంత్రం వరకు స్నేహితుడు వేణుతో కలిసి మద్యం తాగాడు. ఇప్పుడే వస్తానని చెప్పి లాడ్జికి వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోయేసరికి వేణు లాడ్జికి వెళ్లి చూసేసరికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరివేసుకునే ముందు బాధితుడు తనను స్నేహితులు, ప్రేమించిన యువతి మోసం చేశారని, భార్య, తల్లికి క్షమాపణలు చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతిని తీసుకుని వస్తే సాయం చేస్తామన్న స్నేహితులు తర్వాత మోసం చేశారని చెప్పాడు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News