Thursday, April 25, 2024

బోధన్ లో యువకుడి మృతదేహం…

- Advertisement -
- Advertisement -

బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్ గావ్ గ్రామానికి చెందిన శ్రీకాంత్(20) అనే యువకుడి మృతదేహం బోధన్ పట్టణంలోని పసుపు వాగు వద్ద లభ్యమైంది. శ్రీకాంత్ గత మూడు నెలల క్రితం అదృశ్యమైన విషయం తెలిసిందే. సోమవారం యువకుడు బోధన్ పట్టణంలో శవమైతేలాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. మూడు నెలల క్రితం నుంచి యువకుడు ఎక్కడికి వెళ్లాడు. ఎవరైనా చంపి ఇక్కడ పడేశారా? లేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News