- Advertisement -
మన తెలంగాణ/నిర్మల్ రూరల్: నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మంజూలపూర్ ఎక్స్ రోడ్డు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇవాళ ఉదయం పది గంటల ప్రాంతంలో నిర్మల్ నుండి భైంసా వెళ్తున్న భైంసా డిపోకు చెందిన ఆర్టీసి బస్సు (ఎపి 30 జెడ్ 0011) అటువైపుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో దిలావర్పూర్ గ్రామానికి చెందిన రాహిల్ (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -