Friday, March 29, 2024

డిసిఎం ఢీకొని యువకుడు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

young man dead in road accident at Sangareddy

సంగారెడ్డి: డిసిఎం ఢీకొని యువకుడు మృతి చెందిన విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కొత్తూరు గ్రామ శివారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ దుర్గఘటనలో ప్రశాంత్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ప్రశాంత్ రోడ్డు దాటే క్రమంలో వేగంగా వచ్చిన డిసిఎం  ఢీకొట్టింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న జహీరాబాద్ రూరల్ ఎస్ఐ వినయ్ కుమార్ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

young man dead in road accident at Sangareddy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News