- Advertisement -
హైదరాబాద్: నగరంలోని విద్యానగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎండ్రిక్ హఠన్ (23) అనే సాప్ట్ వేర్ ఉద్యోగి అధిక వేగంతో బైక్ పై వెళ్తూ స్తంభానికి ఢీకొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడిని హైదరాబాద్ లోని సౌత్ లాలాగూడ విజయపురి కాలనీ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో విద్యానగర్ నుండి నల్లకుంట వెళ్లే దారిలో ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రి రోడ్డులో చోటు చేసుకుంది. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
- Advertisement -