Tuesday, April 23, 2024

కరోనా పరీక్ష చేస్తుండగా యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కరోనా నిర్ధారణ పరీక్ష కోసం వచ్చిన యువకుడు పిహెచ్‌సిలో మృతి చెందిన సంఘటన వరంగల్‌లో అర్బన్ జిల్లాలో బీమదేవరపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్తకొండ గ్రామానికి చెందిన చిరంజీవి (35) వ్యవసాయ బావులు తవ్వి జీవనం సాగిస్తున్నాడు. గత వారం రోజుల నుంచి జ్వరం రావడంతో మందులు వాడినా తగ్గలేదు. కరోనా నిర్ధారణ పరీక్ష కోసం ములుకనూర్ పిహెచ్‌సికి వచ్చాడు. ర్యాపిడి యాంటిజన్ పరీక్ష చేస్తుండగా శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడి కిందపడిపోయాడు. అతడిని పరీక్షించి 108కి సమాచారం ఇచ్చారు. 108 వాహనంలో ఆక్సిజన్ అందిస్తుండగా అతడు చనిపోయినట్లు వైద్యాధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News