Friday, April 26, 2024

ప్రాణం తీసిన ఐస్ క్రీమ్

- Advertisement -
- Advertisement -

ice-cream

 

మేడ్చల్: ఐస్‌క్రీం తిన్న కొద్దిసేపటికే ఓ యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాచారంలోని విఎస్టీకాలనీకి చెందిన సాయిసంపత్‌(20) ఈనెల 20న  జొమోటో ఫుడ్ డెలవరీ యాప్ ద్వారా అర కేజీ ఐస్‌క్రీం ఆర్డర్‌ చేసి తెప్పించుకున్నాడు. ఐస్‌క్రీం తిన్న సాయికి మరుసటి రోజు వాంతులుతో పాటు విరేచనాలు కావడంతో బాత్‌రూంకు వెళ్లాడు. బాత్ రూమ్ లోని  సాయికి శ్వాస సరిగా రావడంలేదని తల్లికి చెప్పడంతో 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మార్గం మధ్యలోనే కన్నుమూశాడని తెలిపారు. సాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సిఐ కిరణ్ కుమార్ తెలిపాడు. సాయి తినగా మిగిలిన ఐస్ క్రీమ్ ను ల్యాబ్ పంపించామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News