Friday, April 26, 2024

నిద్ర మత్తులో నాలుగో అంతస్తు నుండి పడి యువకుడు మృతి..

- Advertisement -
- Advertisement -

గ్రూప్-1కు ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు నాలుగో అంతస్తు నుంచి కింద పడి మృతి చెందిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. నాగోలు అరుణోదయకాలనీ రోడ్డు నెం. 8, ఎస్ఎస్ఆర్ అపార్ట్ మెంట్ లో నివసించే రావూరి కిషోర్, స్వర్ణలత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు రావూరి జ్ఞానప్రకాష్ హేమంత్ గ్రూప్-1కు ప్రిపేర్ అవుతున్నాడు. రాత్రి సమయంలో చదువుకుంటూ నిద్ర వచ్చినప్పుడు నాలుగో అంతస్తుకు వెళ్లి వాకింగ్ చేస్తుంటాడు . శుక్రవారం తెల్లవారు జామున నిద్ర వస్తున్నట్లు అనిపించడంతో అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తుకు వెళ్లి గోడపై కూర్చున్నాడు. నిద్ర మత్తులో విద్యుత్ వైర్లపై పడి అక్కడి నుంచి నేలపై పడిపోయాడు. పెద్ద శబ్ధం రావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు బయటకు వచ్చి చూడగా హేమంత్ కిందపడి తీవ్ర గాయాలతో కనిపించాడు. వెంటనే 108లో ఎల్బీనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి కిషోర్ ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News