- Advertisement -
మేడ్చల్: జిల్లాలోని దుండిగల్ డి పోచంపల్లి చెరువులో మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతుడు నిన్న(శనివారం) అదృశ్యమైన వంశీగౌడ్(23)గా పోలీసులు గుర్తించారు. చెరువు గట్టుపై మృతుడి బట్టలు, సెల్ ఫోన్ ఆధారంగా నిర్ధారించినట్లు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Young Man died as fell into pond in Medchal
- Advertisement -