Wednesday, April 24, 2024

భవనంపై నుంచి పడి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

Young Man fell from building and died

 

మనతెలంగాణ, హైదరాబాద్ : భవనంపై నుంచి పడడంతో యువకుడు మృతిచెందిన సంఘటన నగరంలోని మియాపూర్‌లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్న సాయి నిఖిత్ రెడ్డి(20) మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉంటున్నాడు. తెల్లవారుజామున భవనంపై నుంచి కిందపడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News