Thursday, March 28, 2024

భవనంపై నుంచి పడి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

young man fell from the building and died

హైదరాబాద్: ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి యువకుడు మృతిచెందిన సంఘటన నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో నివాసం ఉండే తాళ్లూరి శ్యామ్యూల్ సుజిత్(32) రోజు తన సోదరుడితో ఫోన్‌లో వీడియో కాల్ మాట్లాడుతాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి కూడా సోదరుడితో వీడియో కాల్ మాట్లాడుతూ రెండో అంతస్తు బాల్కనీ నుంచి జారీ కిందపడ్డాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే సుజిత్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన సుజిత్‌ను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయం కావడంతో సుజిత్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

young man fell from the building and died

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News