Thursday, April 25, 2024

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

Young man killed in road accident at Rangareddy

నందిగామః రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన నందిగామ పోలీసు స్టేషన్ పరిధిలోని పాత జాతీయ రహదారిపై అదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి గ్రామానికి చెందిన ఛీర్ణం మహేష్ (22) తండ్రి చిన్నయ్య వృత్తి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో మహేష్ అదివారం ఉదయం తన సొంత గ్రామానికి బైక్ పై వెళుతుండగా మార్గమధ్యలో నందిగామ మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై న్యూజీవీడు పరిశ్రమ వద్దకు రాగానే షాద్‌నగర్ డిపో బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా వస్తున్న మహేష్ బైక్ ను ఢీకొట్టడంతో మహేష్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మహేష్‌ను చికిత్స నిమిత్తం షాద్‌నగర్ సర్కార్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని తండ్రి చిన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Young man killed in road accident at Rangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News