Thursday, April 25, 2024

యువకుడిని గడ్డివాములో వేసి తగలబెట్టారు….

- Advertisement -
- Advertisement -

మెదక్: ఓ యువకుడు తనని గడ్డివాములో వేసి గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారని చెప్పిన సంఘటన మెదక్ జిల్లా తుప్రాన్ ప్రాంతం రావెళ్లిలో శనివారం జరిగింది. సదరు యువకుడు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనిల్ గౌడ్ అనే యువకుడు(26) కిరాణం షాపు నడిపిస్తూ తన సొంత గ్రామమైన మక్కరాజ్‌పేటలో ఉంటున్నాడు. హైదరాబాద్‌లో బైక్‌కు సర్వీసింగ్ చేయిస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. తుప్రాన్ పరిధిలోని ఓ గడ్డివాములో ఓ యువకుడు కాలిపోతుండగా వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి రహదారిపై ఇటుఅటు తిరుగుతున్నాడు.

పోలీసులు సదరు యువకుడిని ప్రశ్నించినప్పుడు తనని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు గడ్డిలో వేసి తగలబెట్టారన్నారు. వెంటనే అతడిని అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ స్వామి గౌడ్ తెలిపాడు. ఆరు నెలల క్రితం అనిల్ గౌడ్ తండ్రి ప్రసాద్ గౌడ్ చనిపోవడంతో రైతుబీమా కింద వచ్చిన ఐదు లక్షల రూపాయలు అనిల్ ఖర్చు చేశాడు. దీంతో పలుమార్లు కుటుంబ సభ్యులు డబ్బుల గురించి ప్రశ్నించిడంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసుల భావిస్తున్నారు. లేక ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News