Friday, April 19, 2024

కెటిఆర్ ను కలిసేందుకు యువకుడి పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

పెద్దేముల్: పలు రకాల సమస్యలతో ఇబ్బంది పడున్నామని, మా సమస్యలు మంత్రి కెటిఆర్ కు చెప్పుకునేందుకు పాదయాత్రగా ప్రగతి భవన్ కు వెళ్తున్నానని కరణ్ కోట్ గ్రామానికి చెందిన ఉడుము లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం ఉదయం 2గంటలకు ప్రారంభమైన లక్ష్మణ్ పాదయాత్ర పెద్దేముల్ మండల పరిధిలోని దుర్గాపూర్ గ్రామం వరకు చేరుకుంది.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మన తెలంగాణతో మాట్లాడుతూ.. తన తల్లి పద్మమ్మ పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని, అంతే కాకుండా తాను కూడా అనారోగ్యంతో ఉన్నానని అన్నారు. తాము ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగకపోవడం వలన పాదయాత్రగా బయలుదేరానని చెప్పారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ ను కలిసి మన సమస్యలు వివరిస్తానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News