Saturday, April 20, 2024

మెట్లు ఎక్కుతుండగా కింద పడి యువతి మృతి

- Advertisement -
- Advertisement -

Young woman was killed as she climbed stairs

 

మన తెలంగాణ/బీర్కూర్/కామారెడ్డి : బీర్కూర్ మండలం బరంగ్‌ఎడ్గి గ్రామానికి చెందిన లక్కపల్లి కవిత (22) అనే యువతీ బీర్కూర్ శివారులోని దత్తాత్రేయ మందిరం వద్ద మెట్లు ఎక్కుతుండగా కింద పడి మృతిచెందినట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కవిత గత కొన్ని రోజులుగా బాన్సువాడలో తన అక్క వద్ద ఉంటుందన్నారు. బాన్సువాడకు చెందిన శివకుమార్ అనే యువకుడితో ప్రేమ ఏర్పడిందని, వారిద్దరు కలిసి బరంగ్ ఎడ్గికి బయలుదేరారు. కాగా, బీర్కూర్ టీటీడీ లో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి టీటీడీ సమీపంలోని దత్తాత్రేయ మందిరానికి వచ్చారు. మెట్లు ఎక్కుతుండగా, యువతీ మృతిచెందిందని, అనారోగ్యంతో మృతిచెందిందని బాన్సువాడ రూరల్ సిఐ టాటాబాబు తెలిపారు. కాగా, వీరిద్దరు ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాలకు తెలుసని, అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులు తెలిపారు. ఆమె ఒక్కోసారి స్పృహతప్పి పడిపోయేదని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News