Thursday, April 25, 2024

ప్రేమించాడు.. మోసం చేశాడు… యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

women committed suicide in Secunderabad

హైదరాబాద్: ప్రేమించిన యువకుడు మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని కాప్రా ప్రాంతంలో జరిగింది. దీంతో యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గాంధీనగర్ లో కార్తీక్ అనే యువకుడు ఓ యువతి వెంటపడి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. మాయమాటలతో ఆమెను బుట్టలో వేసుకున్నాడు. గత కొన్ని రోజులగా వేరే అమ్మాయితో చనువుగా ఉండడంతో కార్తీక్‌ను సదరు యువతి నిలదీసింది. సదరు యువతిని కార్తీక్ పెళ్లి చేసుకోనని చెప్పడంతో మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఏప్రిల్ 19న ఉరేసుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు కార్తీక్‌పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News