- Advertisement -
మెదక్: జిల్లాలోని శివంపేట మండలం అల్లిపూర్ గ్రామంలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. తన పొలంలోకి ట్రాక్టర్ ను రానివ్వకపోవటంతో అన్నపై ఓ తమ్ముడు పారతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అన్న రమేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. తక్షణమే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రమేశ్ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు మల్లేశ్ ఇంటిని కూల్చివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలోకి వస్తుండడంతో వారిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Younger brother killed elder brother at medak
- Advertisement -