- Advertisement -
ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ కెరమెరిలోని పోలీస్ క్వార్టర్స్ లో ఘర్షణ వాతావరణం నెలకొంది. హెడ్ కానిస్టేబుల్ పరశురాము కుమారుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి లోనైన తమ్ముడు మహేశ్ అన్న రమేష్ పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రమేష్ ను చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దాడికి పాల్పడిన మహేష్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Younger Brother Knife attack on elder brother in Asifabad
- Advertisement -