Friday, April 19, 2024

పంజాబ్‌లో యువ అకాలీ కాల్చివేత

- Advertisement -
- Advertisement -

Youth Akali Dal leader shot dead in Mohali

పట్టపగలే నడిరోడ్డుపై దారుణం

మొహాలీ : పంజాబ్‌లో యువ అకాలీదళ్ నేత విక్కీ మిద్ధుఖేరాను పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. రాష్ట్రంలోని మొహాలీలో శనివారం ఈ ఒళ్లుగగుర్పాటు ఘటన జరిగింది. నలుగురు వ్యక్తులు వెంటబడి ఆయనను తరిమినట్లు, తరువాత గురిచూసుకుని కాల్పులు జరపడంతో ఆయన ఘటనాస్థలిలోనే మృతి చెందినట్లు స్థానిక పోలీసు వర్గాలు తెలిపాయి. 8 నుంచి 9 రౌండ్ల మేర కాల్పులు జరిగాయని , ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని సీనియర్ పోలీసు అధికారి సతీందర్ సింగ్ వెల్లడించారు. సమీపంలోని సిసీటీవీ కెమెరాలలో ఈ ఘటన రికార్డు అయింది. స్థానిక సెక్టార్ 71లో విక్కీ వాహనం వద్ద నిలిపి ఉంచిన కారులో వేచి ఉన్న దుండగులు ఆయనను తరిమితరిమి చంపినట్లు స్పష్టం అయింది. ఇంతకు ముందు పంజాబ్ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షులుగా ఉండి తరువాత ఆయన శిరోమణి అకాలీదళ్ స్టూడెంట్ వింగ్‌లో చేరారు. గ్యాంగ్ వార్ కక్షలతోనే ఆయన హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News