Thursday, April 25, 2024

టిక్‌టాక్ కోసం బతికున్న చేపను మింగి…. యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

Youth swallows fish for tiktok after die

 

చెన్నై: టిక్‌టాక్ కోసం ఓ యువకుడు బతికి ఉన్న చేపను మింగడంతో ఊపిరాడక మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం హోసూర్‌లోని పార్వతి నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎస్ వెట్రివల్ (22) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. అనంతరం గ్రామ శివారులోని తెర్‌పట్టాయ్ చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. టిక్‌టాక్ వీడియో కోసం బతికున్న చేపను మింగాడు. చేప గొంతులో ఇరుక్కపోవడంతో ఊపిరాడక కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News