- Advertisement -
భోపాల్: మెడకు బెల్టు కట్టి కర్రలతో దాడి చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లా అర్జున్ పూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బల్దవ్ జాదవ్ (28) అనే వ్యక్తి ఓ కేసులో జైలు నుంచి విడదలయ్యాడు. ఓ అమ్మాయిని అతడు వేధించడంతో ఆమె బంధువులు అతడిని పట్టుకొని చితకబాదారు. మెడకు బెల్టు చుట్టి ఒకరు పట్టుకోగా మరో వ్యక్తి కర్రతో దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీసులు వీడియో గుర్తించి బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Courtesy by NDTV
- Advertisement -