న్యూఢిల్లీ: కరోనా వైరస్పై పోరుకు టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ రూ.50 లక్షలు విరాళంగా ప్రకాటించాడు. ప్రత్యేకమైన ఈ రోజున పిఎం కేర్స్కు రూ.50 లక్షలు సాయం చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. కరోనాపై పోరుకు స్ఫూర్తినిస్తూ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు విద్యుద్దీపాలు ఆర్పి దీపాలు, కొవ్వొత్తులు, లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు యువీ తన మద్దతును తెలియజేస్తూ పిఎం కేర్స్కు సాయం చేస్తున్నానని ట్వీట్ద్వారా తెలియజేశాడు.‘ దేశమంతా ఐక్యంగా ఉంటేనే బలంగా ఉంటాం. ప్రధాని మోడీ పిలుపు మేరకు ఈ రోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు కొవ్వొత్తులు వెలిగిస్తున్నాను. నాతో మీరు కూడా వెలిగిస్తారా? ఈ ప్రత్యేకమైన రోజున పిఎం కేర్స్కు రూ.50 లక్షలు సాయంగా అందిస్తున్నా. మీరుకూడా వీలయినంత సాయం చేయండి’ అని యువరాజ్ ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. అతడితో పాటుగా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ కూడా ప్రధాని మోడీ పిలుపునకు మద్దతు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు.